నందమూరి తారకరత్న ఇక లేరు, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు అన్న సంగతి తెలిసిందే. తారకరత్న పార్థివదేహాన్ని ఈ రోజు ఉదయం మోకిల నుంచి ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీంతో తారకరత్నను కడసారి చూసేందుకు అభిమానులు తరలివస్తున్నారు. తారకరత్న భౌతికకాయానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. తారకరత్న మరణంతో ఆయన భార్య అలేఖ్యా రెడ్డి, ముగ్గురు పిల్లలు ఒంటరి వారైపోయారు. ఈ నేపథ్యంలోనే బాలయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారట. తారకరత్న […]