దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్ట్ నోటీసులు.. నవంబర్ 14న హాజరవ్వాల్సిందే

తాజాగా దగ్గుబాటి ఫ్యామిలీ ఓ వివాదంలో చిక్కుకున్నారు.హైదరాబాద్ ఫిలింనగర్‌లో దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కాంట్రవర్సీకి సంబంధించిన కేసులో తాజాగా.. దగ్గుపాటి వెంకటేష్, రానా, అభిరామ్‌, నిర్మాత సురేష్ బాబు లకు నాంపల్లి కోర్ట్ కీలక నోటీసులు అందించింది. ఇక నేడు ఈ కేసు విచారణ జరిపిన కోర్ట్‌.. నవంబర్ 14న తదుపరి విచారణ ఉండ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. కచ్చితంగా వెంకటేష్, రానా, అభిరామ్, సురేష్ బాబులు హాజరు కావాలంటూ క్లారిటీ ఇచ్చింది. వ్యక్తిగత పూచికత్తు సమర్పించాల్సి ఉందని.. […]