వాడికి ఏం చెప్పినా అనవసరం.. శివాజీ ఆన్సర్ కి నాగార్జున షాక్..!!

తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 ఈసారి అదిరిపోయే రేంజ్ లో దూసుకుపోతుంది. గత రెండు, మూడు సీజన్లు నుంచి బిగ్ బాస్ రేటింగ్ పడిపోవడంతో.. ఈసారి ఉల్టా పుల్టా గేమ్ స్టార్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. బిగ్ బాస్ చెప్పినట్టుగానే ఈ సీజన్ మొత్తం ఉల్టా పుల్టాతో అదిరిపోయే ట్విస్టులు ఇస్తూ ప్రేక్షకులకి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు.

ఇక బిగ్ బాస్ లో ఐదు వారాలు ఒక ఎత్తు అయితే… శనివారం నాగార్జున ఎపిసోడ్ మరో ఎత్తు. సోమవారం నుంచి శుక్రవారం వరకు హౌస్ లో కంటెస్టెంట్స్ చేసిన ఒక్కో తప్పుని చెబుతూ ఈసారి నాగార్జున కూడా తన ప్రతిభని బాగానే చూపించాడు. ఇక ఈవారం కూడా హౌస్ మేట్స్ను ఓ రేంజ్ లో వేసుకున్నాడు నాగార్జున. ఇక ఈరోజు ప్రోమో-2 విషయానికి వస్తే.

స్టార్టింగ్ లోనే శోభాషెట్టిపై సీరియస్ అయ్యారు. తన తీసుకున్న నిర్ణయం కారణంగా తన బడ్డీ కూడా గేమ్ ఓడిపోయిందని లేకపోతే మీ బడ్డీ గెలిచేదని వెల్లడించాడు. ఇక తర్వాత గౌతంపై కూడా సీరియస్ అయ్యాడు. అనంతరం శివాజీ ఫ్రూట్ నింజా టాస్క్ గురించి ప్రశ్నిస్తూ.. ” ప్రశాంత్ ఓ పక్క నుంచి చెబుతూనే ఉన్నాడు. అన్నా వాళ్లు తొక్కలు వేస్తున్నారు అని. వదిలేయ్ రా అని ఎలా అంటావ్ శివాజీ ” అని అడిగాడు నాగార్జున.

దీనికి శివాజీ మాట్లాడుతూ.. ” ప్రతి దానికి గొడవ పెట్టుకోడం నావల్ల కాదు సర్. పైగా తొక్కలు వేయడం చూడలేదు. పక్కనుంచి ఫ్రూట్ తీసుకోవడం చూశాను అని చెప్పాడు. అయితే సంచాలక్ అమర్ దీప్‌తో చెప్పాలి కదా అని నాగ్ అనగా.. ” అబ్బే అమర్కి ఏం చెప్పినా వినడు సర్. డే వన్ నుంచి వాడు ఓ నెగిటివ్ ఫీలింగ్ పెట్టుకున్నాడు” అంటూ చెప్పుకొచ్చాడు శివాజీ.