రైతు బిడ్డను మడతపెట్టాల్సింది… ప్రశాంత్ పై అర్జున్ కు ఇంత పగ ఉందా…!!

బిగ్ బాస్ 7 .. ఈ షో అంతా రైతుబిడ్డ చుట్టూ తిరుగుతుంది. మొదటి నుంచి అతడిని దూరం పెడుతూ.. అతను ఏం చేసినా విమర్శించడమే పనిగా పెట్టుకుంది సీరియల్ బ్యాచ్. అందుకే ఈ బ్యాచ్ పై విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. ముఖ్యంగా విన్నర్‌గా వెలిగిపోతాడు అనుకున్నా అమర్ సైతం అదే బ్యాచ్ లో ఉండి ఆటలో ఆరిపోయాడు. ప్రశాంత్ ముందు తేలిపోయాడు. అందరిని వెనక్కి నెట్టి ఈ సీజన్లోని తొలి కెప్టెన్ గా నిలిచాడు ప్రశాంత్. ప్రశాంత్ విజయం సీరియల్ బ్యాచ్‌కి నచ్చలేదని టాక్‌ నడిచింది. కానీ ఇటీవల వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన అంబటి అర్జున్ సైతం ఈ గెలుపు మింగుడుపడనట్లు కనిపించింది.

నిన్న రాత్రి లైవ్ లో రైతు బిడ్డపై విషాన్ని కక్కాడు. సాధారణంగా రైతుబిడ్డ, శివాజీ మాట తప్ప హౌస్ లో ఎవరి మాట వినడు. అర్జున్ ఏదో సలహా ఇస్తే అది పట్టించుకోకుండా వెళ్ళిపోయాడట. దీంతో అర్జున్ మండిపడ్డాడు. గేమ్ దగ్గర ప్రశాంత్ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడాడు. అర్జున్ ఏమన్నాడంటే..” ఆ ఎర్రిపుష్పం గాడికి ఓ సలహా ఇస్తే లైట్ తీసుకున్నాడు. ఒక్క టాస్క్ ఏదైనా పడని, చెప్తా.. మొన్న కలర్ టాస్క్ లో మొత్తం మడత పెట్టేసి ఉండాల్సింది. ఎందుకు వదిలేసావ్? ఆ టాస్క్ లో మడత పెట్టేయాల్సింది. అప్పుడు వీడు ఆడతాడు, వీడు ఆడతాడు అనే మాటనే ఎగిరిపోయేది ” అనీ చెప్పుకొచ్చాడు.

ఇది చూసిన జనాలు అర్జున్ మాటలు విని షాక్ అవుతున్నారు. ఐదు వారాల నుంచి ప్రశాంత్ అంతలా కష్టపడి ఆడుతుంటే ఇప్పుడు మధ్యలో వచ్చి అతడిని ఇలా అనడం కరెక్ట్ కాదని కామెంట్లు చేస్తున్నారు. అమర్ నిజ స్వరూపం ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాడు. నీకన్నా అమర్ నయం.. అతడు నటించలేదు తన నోటి వాగుడు వల్ల నెగిటివ్ అయ్యాడు. నువ్వు సీజన్ ప్రారంభం నుంచి ఉండుంటే ఇలా అతడి కన్నా ఎక్కువ నెగిటివ్ అయ్యే వాడివి అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.