టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డును అందుకొని భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు అల్లు అర్జున్. తాజాగా మరో రికార్డును సృష్టించాడు. ప్రతిసాత్మకంగా భావించే మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో త్వరలో బన్నీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారని న్యూస్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక తాజాగా దుబాయ్లో ఉన్న మ్యూజియంలో బన్నీ విగ్రహాన్ని పెట్టబోతున్నామని మేడం టుస్సాడ్స్ ట్విట్ చేసింది.
ఈ నేపథ్యంలోనే బన్ని నుంచి కొలతలు స్వీకరిస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేసింది. టూస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహానికి ఏర్పాటు చేయడంపై అల్లు అర్జున్ స్పందించాడు. తనకు ఇలాంటి అరుదైన గౌరవం దక్కడం ఎంతో సంతోషాన్ని కల్పిస్తుందని.. ఇది ఒక రకంగా నాకు ప్రత్యేకమైన అనుభూతిని అందించింది. చిన్నతనంలోనే టుస్సాడ్స్ విజయాన్ని సందర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఈ మ్యూజియంలో నా మైనపు విగ్రహాన్ని చూస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.
సినీ, క్రీడలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల మైనపు విగ్రహాలన్నీ ఆమ్యూజియంలో పొందుపరిచారు. సింగపూర్, లండన్, దుబాయ్లో వివిధ చోట్ల ఈ మ్యూజియం శాఖలు ఉన్నాయి. ఇక దుబాయ్ లోని మ్యూజియంలో అమితాబచ్చన్, ఐశ్వర్యారాయ్, రణ్బీర్ కపూర్, షారుక్ ఖాన్ లాంటి సినీ ప్రముఖుల విగ్రహాలు చూడోచ్చు త్వరలోనే బన్నీ విగ్రహం కూడా ఇక్కడ ఏర్పాటు కానుంది మరోవైపు మహేష్ బాబు, ప్రభాస్, కాజల్ లాంటి టాలీవుడ్ సెలబ్రిటీలు ఇప్పటికే ఈ గౌరవాన్ని అందుకున్నారు.