బిగ్ బాస్ ఎలిమినేషన్: ఆరో వారం కూడా అమ్మాయేనా….!!

బిగ్ బాస్ హౌస్ కు గ్లామర్ టచ్ కావాలంటే అమ్మాయిలు ఉండాల్సిందే! అందుకే షో ప్రారంభంలో 14 మంది కంటెస్టెంట్లను తీసుకొస్తే అందులో ఏడుగురు అమ్మాయిలే ఉన్నారు. కానీ ఏం లాభం? వరుస పెట్టి అమ్మాయిలని హౌస్ నుంచి పంపించేస్తూ వస్తున్నారు. అలా ఇప్పటివరకు ఐదుగురు అమ్మాయిలు ఎలిమినేట్ అవుతూ వచ్చారు. మొదట కిరణ్ రాథోడ్ తనకు తెలుగు రావడంలేదని పంపించేశారు. షకీలా కంటెంట్ కోసం అతి చేస్తుందని హౌస్ లో నుంచి పంపించేశారు. ఇలా పద్ధతిగా ఉంటే మాకెందుకు అనుకున్నారో ఏమో.. దామిని సింగర్ గా తన టాలెంట్ చూపించే ఈ బ్యూటీ కిచెన్లో వండి మార్చడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది.

ఈ వంటలక్క మాకొద్దని తనను పంపించేశారు. ర‌తీక రోజ్ స్ట్రాంగ్ కంటిస్టెంట్ అనుకున్నారు! పోయి పోయి పల్లవి ప్రశాంత్ తో పెట్టుకుంది. అతడితోనే లవ్ ట్రాక్ నడిపి, వర్కౌట్ కాకపోవడంతో ప్లేట్ ఫిరాయించింది. ఇదే ఆమెను దెబ్బ కొట్టింది. ఆ దెబ్బకు బిగ్ బాస్ హౌస్ బయటకు వచ్చి పడింది. శుభశ్రీ.. ఈ అందాల సుందరి గేమ్ ఆడటం మొదలుపెట్టింది. కానీ అంతా ఆలస్యంగా గేమ్ స్టార్ట్ చేసి మా మనోభావాలు దెబ్బతీసావ్ అంటూ తనను కూడా పంపించేశారు. నెక్స్ట్ ఎవరు? అనేది అసలు ప్రశ్న. ఈవారం నామినేషన్ లో ఏడుగురు ఉన్నారు.

అమర్, ప్రిన్స్, తేజ, శోభా శెట్టి, నయని పావని, పూజ, అశ్విని.. వీరంతా నామినేషన్ లో ఉన్నారు. ఇందులో అమర్, ప్రిన్స్ ఇప్పుడప్పుడే నామినేట్ అయ్యే కంటెస్టెంట్లు కానే కాదు, తేజ లేకపోతే హౌస్ లో ఎంటర్టైన్మెంట్ అనేదే ఉండదు. కాబట్టి మరికొన్ని రోజులు అతడిని హౌస్ లో ఉంచే ఛాన్సెస్ ఉన్నాయి. మిగిలిన నయని, శోభ, అశ్విని, పూజ నలుగురు ఆడపిల్లలే! వీరిలో శోభ ముందు నుంచి ఉన్న కంటెస్టెంట్ కాబట్టి ఫాలోయింగ్ దండిగా ఉంటుంది. గండం గట్టెక్కుతుందనుకుంటున్నారేమో.. సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రచారం ప్రకారం ఈ వారం మోనితనే ఎలిమినేట్ కానుందట. తన తిక్కకు లెక్క లేకుండా పోయింది.

గేమ్ లో స్వయంగా ఆడటానికి బదులు అడ్డదిడ్డంగా ఆడుతుంది. తనే తోపు అన్నట్టుగా మాట్లాడుతుంది. ప్రేక్షకులకు ఇదంతా చిరాకు తెప్పిస్తుంది. తనను పంపించేస్తే అప్పుడు తన గ్రూప్లో ఉన్న మిగతా వాళ్లు కూడా సరైన దారిలోకి వస్తారని అభిప్రాయపడుతున్నారు. అయితే అశ్విని, పూజ, నయని ఉండగా శోభకు తక్కువ ఓటింగ్ రావడంతో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది శోభనే అని అర్థమయిపోయింది. ఇక అఫీషియల్ గా ఎపిసోడ్ రిలీజ్ కావాల్సి ఉంది.