మాంసం ప్రియులకు తెలంగాణ గ‌వ‌ర్న‌మెంట్ గుడ్ న్యూస్‌..!!

మటన్ ప్రియులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 12 నుంచి మటన్ క్యాంటీన్లు హైదరాబాద్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ మటన్ క్యాంటీన్లలో మొదటిది శాంతినగర్ కాలనీలోని ఫెడరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నారు.

రిజనబుల్ రేట్స్ లో మటన్ బిర్యానీ, పాయా , ఖీమా , గుర్తా ఫ్రై , పత్తర్ కా గోష్‌లతో పాటు ఇతర మాంసాహార వంటకాలను ఇక్కడ విక్రయించినున్నారు. ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్‌ను బట్టి మెనూన్ని పెంచనున్నారు. ఇక ఇప్పటికే శాంతినగర్‌లో ఫిష్ క్యాంటీన్ నడుస్తుంది. ఫిష్ భవన్ సమీపంలో ఈ క్యాంటీన్ ఉండగా ఫిష్ ప్రై, ఫిష్ బిర్యానీతో పాటు ఇతర వంటకాలను అందుబాటులో ఉంచారు.

ఈ మటన్ క్యాంటీన్ల పనులకు సీఎం కెసిఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పనులు వేగంగా సాగుతున్నాయి. సంచారం క్యాంటీన్ కూడా నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ దూదిమెట్లు బాలరాజు యాదవ్ తెలిపారు.