భవిష్యత్తు గురించి భయంకర వ్యాఖ్యలు చేసిన వేణు స్వామి..

సినీ ప్రముఖుల జీవితాల గురించి జోష్యం చెప్పే వేణు స్వామి చాలా పాపులర్ అయ్యారు. అందుకు కారణం అతని చెబుతున్న జోష్యం చాలామంది విషయంలో నిజం కావడమేనని చెప్పవచ్చు. మొదటగా అతను నాగచైతన్య సమంత విడిపోతారని అంచనా వేశారు అప్పట్లో అది సంచలనంగా మారింది. అయితే అది ఇటీవల నిజమైంది. దాంతో వేణు స్వామి భవిష్యత్తును చూడగల ఒక గొప్ప ఆస్ట్రాలజర్ అనే పేరు పడిపోయింది.

అంతేకాదు రామ్ చరణ్ చెర్రీలు ఆలస్యంగా బిడ్డను కంటారని కూడా ఇతను ఒక ప్రిడిక్షన్ చేశారు అది కూడా నిజమైంది. రెండు నెలల క్రితం అతను టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక యువ నటుడు చనిపోతాడు అని కూడా జోష్యం చెప్పాడు. తారకరత్న రూపంలో అది నిజమైంది. టాలీవుడ్ యాక్టర్స్ ఇద్దరు పెళ్లి చేసుకుంటారని చెప్పగా అది వరుణ్ తేజ్, లావణ్యల విషయంలో నిజమైంది.

ఇలా వేణు స్వామి చెబుతున్న చాలా మాటలు నిజమవుతూ అతడిని మరింత పాపులర్ చేస్తున్నాయి. ఇక రీసెంట్‌గా అతను చెప్పిన మరికొన్ని జోష్యాలు వైరల్ అవుతున్నాయి. వాటిలో ప్రభాస్ 2023 జాతకం బాగోలేదని చెప్పడం ఒకటి ఉంది. ఇది నిజమవుతుందేమోనని అభిమానులు చాలా బాధపడుతున్నారు. వేణు స్వామి చెప్పిన వాటిలో చాలావరకు చెడు సంఘటలే ఉన్నాయి. ఆయన చెప్పిన చెడులన్నీ నిజమయ్యాయి. ఇక భవిష్యత్తులో అతను ఇంకెన్ని భయంకరమైన జోష్యాలు చెబుతాడోనని టాలీవుడ్ అభిమానులు బిక్కుబిక్కుమంటున్నారు. మరికొందరు అభిమానులు చెడు విషయాలను ముందే చెప్పకపోవడం మంచిదని అంటున్నారు. ఇంకొందరు చెడు వదిలేసి మంచి విశేషాలు మాత్రమే చెప్పాలని కోరుతున్నారు.