మహేష్ సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకుందా… నిజమెంత..!!

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎంతటి క్రేజ్ ఉందో మనందరికీ తెలుసు. మహేష్ సినిమా వస్తుందంటే థియేటర్లల వద్ద ప్రేక్షకులు క్యూ కడతారు. మహేష్ బాబు , త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో 12 ఏళ్ల తర్వాత మహేష్ బాబుతో ఒక సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదలుపెట్టారు.. గతంలో అతడు, ఖలేజా చిత్రం తరువాత మళ్లీ ఇప్పుడు ఆయనతో సినిమాని స్టార్ట్ చేయబోతున్నాడు. ఇక ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొద్ది రోజుల కిందట మహేష్ బాబు ఇంట్లో వరుస విషాదాలతో నెలకొనడంతో ఈ సినిమా షూటింగ్ కొద్దిగా బ్రేక్ పడింది.

Pooja Hegde confirms doing her next film with Mahesh Babu

ఇక ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ కోసం జాయిన్ అయ్యాడు. అయితే షూటింగ్ బ్రేక్ పడిన కారణంగా కంటిన్యూగా 60 రోజులు షూటింగ్ చేయనున్నారని తెలుస్తోంది. మహేష్ మొదటి యాక్షన్ ఎంటర్టైనర్ అని అంతా అనుకుంటున్నారు. కానీ ఈ సినిమా కథలో మార్పులు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాను పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో తెరకెక్కించనున్నారు త్రివిక్రమ్. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది.

అయితే సినిమాలో హీరోయిన్గా విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.అయితే ఈ సినిమాకు హీరోయిన్ గా పూజ హెగ్డేను ఎంచుకున్నారట. కానీ పూజ హెగ్డే తీసిన సినిమాలన్నీ డిజార్డర్ గా నిలిచాయని దాంతో అమ్మడిని తీసుకోవటంపై మహేష్ బాబు అభిమానులు కాస్త నిరుత్సాహంతో ఉన్నట్లు సమాచారం.షూటింగ్ ఆలస్యం అవ్వడంతో పూజ హెగ్డే డేట్స్ కూడా అడ్జస్ట్ అవ్వటం లేదని అందుకోసమే ఆమెను మార్చాలని అనుకుంటున్నారట. అలాగే త్వరలోనే మరో హీరోయిన్ పేరును ఎంపిక చేసి అనౌన్స్మెంట్ చేయబోతున్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాల్సి ఉంది.