దేనికి పనికి రాదు..ఇండస్ట్రీకి అదోక దండగా.. కాక రేపుతున్న దిల్ రాజు మాటలు..!!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోల్ అవుతున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్న సినిమా “వారిసు” తెలుగులో “వారసుడు” అనే పేరుతో ఈ సినిమా రాబోతుంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా ..నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది . ఈ సినిమా ఏ ముహూర్తాన స్టార్ట్ అయిందో స్టార్ట్ అయిన ప్రతిక్షణం నుంచి ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంది .

కాగా ఈ మధ్యకాలంలో ఈ సినిమా రిలీజ్ కి సంబంధించి ఎలాంటి సస్పెన్స్ నెలకొందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సంక్రాంతి బరిలో ఈ సినిమా పోటీ ఇస్తుండడంతో తెలుగు సినిమాలకే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలని నిర్మాత మండలి ఫైనల్ నిర్ణయం తీసుకోవడం దిల్ రాజుకి బిగ్ షాక్ అనే చెప్పాలి. కాగా రీసెంట్గా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ ..స్టార్ హీరో హీరోయిన్స్ బిహేవియర్ పై పరోక్ష కామెంట్స్ చేశారు. మనకు తెలిసిందే దిల్ రాజు ఉన్నది ఉన్నట్లు ఫేస్ మీదనే మాట్లాడుతారు . దాచుకోవడం అస్సలు తెలియదు . ఈ క్రమంలోనే దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆయన మాట్లాడుతూ..” ఈ కార్ వ్యాన్ కల్చర్ ఎప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చిందో అప్పటినుంచి షూటింగ్ టైం వేస్ట్ అనేది ఎక్కువగా జరుగుతుంది . అంతకుముందు పద్ధతి వేరేగా ఉండేది ..కానీ మారుతున్న కాలానికి పెరుగుతున్న టెక్నాలజీకి హీరో హీరోయిన్స్ ప్రత్యేక కార్ వ్యాన్ను తెప్పించుకుంటున్నారు. ఈ క్రమంలోనే షూటింగ్ లో షాట్ రెడీ అయింది అని చెప్పడానికి ..నానా తంటాలు పడాల్సి వస్తుంది. షాట్ రెడీ అంటే ముందు వెళ్లి అవాళ్ళ అసిస్టెంట్ కి చెప్పాలి ..వాళ్ళు వెళ్లి కార్ వ్యాన్ లో ఉన్న యాక్టర్స్ కి చెప్తారు. వాళ్ళు రెడీ అయి తీరిక గా బయటకు వచ్చి అక్కడ క్రౌడ్ మొత్తం క్లియర్ చేసేసరికి 15 – 20 నిమిషాలు పడుతుంది . ఇలా ప్రతిరోజు సినిమాకి సంబంధించిన సగం టైం వేస్ట్ అయిపోతుంది అనిపిస్తుంది అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చాడు . అంతేకాదు ఇది ఒక టైం వేస్ట్ అని ..ఇది దేనికి పనికి రానిదని చెప్పుకోరావడం సంచలనంగా మారింది .