చైతు ..సమంత విడాకులపై నేనేం మాట్లాడలేదంటున్న నాగార్జున

టాలీవుడ్ తో పాటు యావత్ సినిమా పరిశ్రమను ఆశ్చర్యానికి గురి చేసిన ఘటన సమంతా, నాగ చైతన్య విడాకుల వ్యవహారం. సుమారు నాలుగు నెలల క్రితం వీరిద్దరు తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం వీరిద్దరు పలు క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నారు. అయితే సమంతా విడాకుల వ్యవహారంపై పలు రూమర్లు పుట్టాయి. వారు ఈ కారణాలతోనే విడిపోయారంటూ ఎవరికి తోచిన విధంగా వారు వార్తలు రాశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తాజాగా ఈ విడాకుల వ్యవహారం మీద నాగ చైతన్య తండ్రి అక్కినేని నాగార్జున స్పందించాడు. విడాకులు ముందుగా కోరింది ఎవరు? అనే విషయాన్ని ఆయన ప్రస్తావించాడు. సమంతా, నాగా చైతన్య విడాకులపై నాగార్జున షాకింగ్ కామెంట్స్ చేశాడు. తొలుత విడాకులు కావాలని కోరిందే సమంతా అని వెల్లడించాడు. ఆమె కోరిక మేరకే తను విడాకులు ఇచ్చినట్లు చెప్పాడు. సమంతా కోరికను గౌరవించినట్లు తెలిపారు. ఆమె మాటకు తను అడ్డు చెప్పలేదన్నాడు.

వాస్తవానికి నాగార్జున మరికొన్న విషయాలను వెల్లడించాడు. చైతు, సమంతా చాలా అన్యోన్యంగా ఉండేవారని చెప్పాడు. 2021 కొత్త సంవత్సరం వేడుకలను కూడా అంగరంగ వైభవంగా జరుపుకున్నట్లు చెప్పాడు. అయితే చైతన్య నుంచి సమంతా విడాకులు కావాలని ఎందుకు కోరిందో తనకు తెలిదని వెల్లడించాడు. విడాకుల విషయంలో పరువు, మర్యాద గురించి చై చాలా ఆలోచించినట్లు చెప్పాడు. సమంతా మాత్రం కచ్చితంగా తనకు విడాకులు కావాల్సిందేనని పట్టుబట్టినట్లు వెల్లడించాడు. తమకు ఈ నిర్ణయం షాకింగ్ అనిపించిందని చెప్పాడు.

తాజాగా సమంతా తన ఇన్ స్టాలో విడాకుల ప్రకటనతో పాటు చైతుతో ఉన్న ఫోటోలు అన్నింటిని డిలీట్ చేసింది. అయితే కొందరు చైతన్య, సమంతా మళ్లీ కలుస్తారంటూ సోషల్ మీడియలో పోస్టులు పెట్టారు. అంతేకాదు.. విడాకుల పోస్టు డెలిట్ చేయడం వెనుక ఏదో కారణం ఉందంటూ చర్చలు నడిపారు. అయితే తాజా నాగార్జున మాట్లాడుతూ మళ్లీ చైతన్య, సమంతా కలవకపోవచ్చు అని కామెంట్ చేశాడు.