హిందూ దేవుళ్ళపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బుల్లితెర నటి !

వెండితెర, బుల్లితెర నటి నటులు అప్పుడప్పుడు వివాదాలలో చిక్కుకుంటారు .హీరోయిన్స్ అయితే తన అందచందాలతో ఎప్పుడు హీరోలు కంటే కాస్త ఎక్కువుగా వార్తలలో ఉంటారు .ఒకొక్కసారి పర్సనల్ విషయంలో కాకుండా అనవసరమైన విషయలో సమయం ,సందర్భం లేకుండా మీడియా కనపడగానే తాను ఏమి మాట్లాడుతున్నామో తెలియకుండా కాంట్రవర్సీలో చిక్కుకొని ,తరవాత నాలిక కర్చుకుంటారు.ఒకొక్కసారి అది ఎంత కాంట్రవర్సీ అవుతుందో మనమందరం చూస్తూనే ఉన్నాం .

అసలు విషయానికి వస్తే భోపాల్ బుల్లితెర నటి శ్వేతా తీవారి తాను నటించిన వెబ్ సిరీస్ వివరాలను వెల్లడించటానికి విలేకర్ల సమావేశం పెట్టగా ఆ సమయంలో హిందూ దేవుళ్ళపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు .ఆమె మాటలు చాల తీవ్ర వివాదాస్పదం అయ్యాయి .తన లోదుస్తులకు ,దేవుడికి ముడిపెడుతూ ఒక వ్యాఖ్య చేశారు .శ్వేతా తీవారి వ్యాఖ్యలు హిందూ దేవుళ్లు కించపర్చే విధంగా ఉన్నాయి అంటూ నెటిజన్లు నుంచి తీవ్ర విమర్శలు ఎదురుకుంటుంది .ఈ విషయంపై మధ్యప్రదేశ్ హోమ్ మినిస్టర్ నరోత్తం మిశ్రా శ్వేతా తీవారి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు .ఈ ఘటనపై 24 గంటలలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని మధ్యప్రదేశ్ పోలీసులను ఆదేశించారు .అందుకే మీడియా ఉంది కదాని ఏదిపడితే అది మాట్లాడకూడని నెటిజన్లు శ్వేతా పై ట్రోల్ చేస్తున్నారు .